👉 12 లక్షల మంది ఉద్యోగులు కావాలి

 👉ఉద్యోగాలకు డిజిటల్‌ నైపుణ్యాలే కీలకంగా మారతాయని ఓ సర్వేలో వెల్లడైంది.

  • ఏమిటి : 12 లక్షల మంది ఉద్యోగులు కావాలి
  • ఎప్పుడు : 2025 నాటికి  
  • ఎవరు : డిజిటల్‌ నైపుణ్యం గలవారు
  • ఎక్కడ : సింగపూర్‌
  • ఎందుకు : డిజిటల్‌ నైపుణ్య పరంగా ఎదురయ్యే సవాళ్లను ఉద్యోగులు భవిష్యత్‌లో ఎదుర్కోవడానికి


👉2025 నాటికి వివిధ సంస్థలు ఎంపిక చేసుకునే ఉద్యోగాలకు డిజిటల్‌ నైపుణ్యాలే కీలకంగా మారతాయని ఓ సర్వేలో వెల్లడైంది.

👉సింగపూర్‌ వంటి చిన్న దేశాలు సైతం ఇందుకు సన్నద్ధం కావాలని అంచనా వేసింది.

👉2025 నాటికి సింగపూర్‌ ఆర్థికవ్యవస్థకు 12 లక్షల మంది డిజిటల్‌ నైపుణ్యం గల ఉద్యోగులు అవసరమవుతారని తేల్చింది.

👉ప్రస్తుతం ఆ దేశంలో ఉన్న 22 లక్షల మందిలో వీరి వాటా 55% వరకు ఉంటుందని తేలింది. డిజిటల్‌ నైపుణ్య పరంగా ఎదురయ్యే సవాళ్లను ఉద్యోగులు భవిష్యత్‌లో ఎలా ఎదుర్కోనున్నారనే కోణంలో చేపట్టిన ఈ సర్వే వివరాలను ఆన్‌లైన్‌ వార్తాపత్రిక టుడేలో గురువారం వెల్లడయ్యాయి.

👉 ఆస్ట్రేలియా, భారత్, ఇండోనేసియా, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియాతో కలిపి మొత్తం ఆరు దేశాల్లోని 3 వేల మంది నుంచి వివరాలు సేకరించారు.

👉 ఇప్పటికే సింగపూర్‌లోని ప్రతి 10 మంది ఉద్యోగుల్లో ఆరుగురు తమ విధుల్లో డిజిటల్‌ నైపుణ్యాలను వినియోగిస్తున్నారు.

👉ఈ విషయంలో సింగపూర్‌ రెండో స్థానంలో, 64%తో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలిచింది. అడ్వాన్స్‌డ్‌ డిజిటల్‌ స్కిల్స్‌ పరంగా చూస్తే ఆస్ట్రేలియాలోని ప్రతి ఐదుగురిలో ఒకరు..అంటే 22% మంది వినియోగిస్తున్నారు.

👉 ఆరు దేశాల్లో ఇదే అత్యధికం. ఆ తర్వాతి స్థానంలో 21%తో దక్షిణ కొరియా ఉంది.

👉భారత్‌లోని ఉద్యోగుల్లో 12% మందికే డిజిటల్‌ స్కిల్స్‌ ఉన్నప్పటికీ, అడ్వాన్స్‌డ్‌ డిజిటల్‌ స్కిల్స్‌ కోసం అత్యధికంగా 71% మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం.

👉 ఈ విషయంలో సింగపూర్‌ 59%తో మూడో స్థానం నిలిచింది.

👉ఈ దేశంలోని ఉద్యోగులు సాంకేతికపరమైన మార్పులకు అనుగుణంగా ఎదిగేందుకు సరాసరిన ఏడు డిజిటల్‌ స్కిల్స్‌ను నేర్చుకోవాల్సి ఉంటుందని సర్వే అంచనా వేసింది.

👉 సింగపూర్‌కు భవిష్యత్తులో అవసరమయ్యే 12 లక్షల మందిలో.. ఇప్పటి వరకు ఎలాంటి డిజిటల్‌ నైపుణ్యాలను వినియోగించని వారు, నిరుద్యోగులు/ 2025 నాటికి ఉద్యోగం అవసరమయ్యే వారు, ప్రస్తుతం విద్యార్థులుగా ఉండి ఉద్యోగాల్లో చేరే వారు డిజిటల్‌ నైపుణ్యాలను నేర్చుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

👉 ప్రస్తుతం ఉన్న వారితో కలిపి మొత్తం 2025 నాటికి సింగపూర్‌లోని ఉద్యోగులకు 2.38 కోట్ల డిజిటల్‌ స్కిల్‌ ట్రయినింగ్‌ సెషన్స్‌ నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది.

👉అదే భారత్‌లో, 2025 నాటికి 39 కోట్ల ట్రయినింగ్‌ సెషన్స్‌ అవసరమవుతాయని అంచనా వేసింది. 20202025 మధ్య భారత్‌తోపాటు, జపాన్, సింగపూర్‌లలోని డిజిటల్‌ స్కిల్డ్‌ సిబ్బందికి అడ్వాన్స్‌డ్‌ క్లౌడ్‌ స్కిల్స్‌లోకు ఎక్కువ డిమాండ్‌ ఉంటుందని వెల్లడించింది.

👉ఈ నైపుణ్యాలను ఉద్యోగులు అందిపుచ్చుకోకుంటే 2025 నాటికి డేటా, క్లౌడ్, సైబర్‌ సెక్యూరిటీ నైపుణ్యం ఉండే సిబ్బంది కొరతను వాణిజ్య సంస్థలు ఎదుర్కోనున్నాయని అంచనా వేసింది.

👉డిజిటల్‌ నైపుణ్య పరంగా మొదటి  మూడు దేశాలు

  • ఆస్ట్రేలియా
  • సింగపూర్
  • దక్షిణ కొరియా

 

Post a Comment

0 Comments

Close Menu