👉 స్వచ్ఛ ఐకానిక్‌ స్థలాలు నాలుగో దశ

 స్వచ్ఛ ఐకానిక్‌ స్థలాలు నాలుగో దశ

  • ఏమిటి : స్వచ్ఛ ఐకానిక్‌ స్థలాలు నాలుగో దశ
  • ఎప్పుడు : ఫిబ్రవరి 25
  • ఎవరు : కేంద్ర ప్రభుత్వం
  • ఎక్కడ : భారత్ లో
  • ఎందుకు : పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు

👉స్వచ్ఛ ఐకానిక్‌ స్థలాలు నాలుగో దశలో భాగంగా 12దర్శనీయ ప్రదేశాలను స్వచ్ఛ పర్యాటక గమ్యస్థానాలుగా మారుస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

👉స్వచ్ఛ భారత్‌ మిషన్‌ చొరవతో స్వచ్ఛ ఐకానిక్‌ ప్లేసెస్‌కింద దేశంలోని గొప్ప వారసత్వ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదేశాలను స్వచ్ఛ పర్యాటక గమ్యస్థానాలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినది .

👉 స్వచ్ఛ పర్యాటక గమ్యస్థానాలుగా ఎంపికైన 12 ప్రదేశాలు...

1  గోల్కోండ (తెలంగాణ)

2   అజంతా గుహలు (మహారాష్ట్ర)

3 సాంచీ స్థూపం (మధ్యప్రదేశ్)‌

4  కుంభల్‌గఢ్‌ కోట  (రాజస్తాన్‌)

5  జైసల్మేర్‌ కోట (రాజస్తాన్‌)

6 రామ్‌దేవ్రా (రాజస్తాన్‌)

7  కోణార్క్‌ సూర్య దేవాలయం (ఒడిశా)

8 రాక్‌ గార్డెన్‌ (చండీగఢ్‌)

9 దాల్‌ సరస్సు (జమ్మూకశ్మీర్)‌

10 బాంకే బిహారీ ఆలయం(మధుర) (ఉత్తరప్రదేశ్)‌

11  ఆగ్రా కోట  (ఉత్తరప్రదేశ్‌)

12 కాళీ ఘాట్‌ ఆలయం (పశ్చిమ బెంగాల్)‌

స్వచ్ఛ భారత్ అభియాన్

👉మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా గురువారం 2014, అక్టోబర్ 2 న ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

  • ప్రారంభ తేదీ: 2 అక్టోబర్, 2014
  • లొకేషన్: కొత్త ఢిల్లీ
  • ముగింపు తేదీ: 2019
  • ఇలా కూడా అంటారు: clean India

స్వచ్ఛ ఐకానిక్‌ స్థలాలు మొత్తం  నాలుగు  దశలో

Post a Comment

0 Comments

Close Menu