✌ పర్సవరన్స్ రోవర్ ....జెజెరో బిలంలో

 
ఏమిటి : అరుణ గ్రహంపై దిగిన నాసా పర్సెవరెన్స్‌ రోవర్‌
ఎప్పుడు : ౨౦౨౧ ఫిబ్రవరి 18 (మార్స్‌ 2020 ప్రాజెక్టు)
ఎవరు : నాసా ప్రయోగం
ఎక్కడ : జెజెరో బిలంలో... పర్సెవరెన్స్‌
ఎందుకు : అరుణ గ్రహంపై గతంలో జీవం ఉందా ? లేదా ?

✌ అంగారక గ్రహం (మార్స్‌)పై అత్యంత అధునాతనమైన, తెలివైన రోవర్‌ పర్సెవరెన్స్‌ను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) విజయవంతంగా దించింది. అరుణ గ్రహంపై గతంలో జీవం ఉందా అనే విషయాలను కనుక్కోవడానికి దీన్ని ప్రయోగించింది. అంగారకుడిపైకి నాసా ప్రయోగాల్లో పర్సెవరెన్స్‌ తొమ్మిదవది. వాటిలో ఇదే అతిపెద్ద, అత్యంత అధునాతన వాహనం. కారు సైజులో ఉంటుంది.

✌ అంగారకుడి మధ్యరేఖ ప్రాంతానికి ఉత్తరాన రాళ్లు, రప్పలు, ఎత్తుపల్లాలతో కూడిన సంక్లిష్ట జెజెరో బిలంలో పర్సెవరెన్స్‌ దిగింది. రానున్న రెండేళ్ల పాటు ఇది తవ్వకాలు చేపట్టి నమూనాలను సేకరిస్తుంది. - భవిష్యత్‌లో ఐరోపా అంతరిక్ష సంస్థతో కలిసి నాసా చేపట్టే ల్యాండర్, రోవర్‌ ప్రయోగాల ద్వారా ఆ నమూనాలను శాస్త్రవేత్తలు భూమికి తీసుకువస్తారు.

ఏ  రాకెట్ ద్వారా...

అరుణ గ్రహంపై జీవనం ఆనవాళ్లను గుర్తించే లక్ష్యంతో మార్స్ 2020 మిషన్‌ను నాసా చేపట్టింది.

✌ మిషన్‌లో భాగంగా ఫ్లోరిడాలోని కేప్‌కేనర్వాల్ అంతరిక్ష కేంద్రం నుంచి జూలై 30 అట్లాస్-5 రాకెట్ ద్వారా 6 చక్రాలతో కారు పరిమాణంలో ఉన్న పెర్‌సెవరెన్స్ రోవర్‌ను నింగిలోకి ప్రయోగించింది.

కెమెరాలు, మైక్రోఫోన్లు, లేజర్లు, డ్రిల్స్ వంటి అత్యాధునిక పరికరాలతో పాటు మినీ హెలికాప్టర్‌ను రోవర్‌లో అమర్చారు.

ఈ రోవర్ సహాయంతో అరుణ గ్రహ నమూనాలను మళ్లీ భూమ్మీదకు తీసుకు రావాలని నాసా ప్రయత్నం చేస్తోంది.

పర్సవరన్స్ రోవర్ 203 రోజుల పాటు, 47.2 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి సంక్లిష్ట జెజెరొ బిలం వద్ద అరుణ గ్రహంపైఅడుగిడింది.


పెర్సీ అనే ముద్దు పేరున్న పర్సవరన్స్ రోవర్ కారు సైజులో 1,026 కేజీల బరువుంటుంది. ప్లుటోనియంను ఇంధనంగా వాడుకుంటుంది.

✌ మార్స్‌పై దిగిన ఏడో రోవర్‌గా పర్సవరన్స్ నిలిచింది.

✌ ఈ రోవర్‌ను రోబోటిక్ జియాలజిస్ట్, అన్త్రో బయాలజిస్ట్‌గా పరిగణించవచ్చు.

✌ అత్యాధునిక శాస్త్ర పరికరాలను, హై రెజొల్యూషన్ ఉన్న 3డీ కెమెరాలను, మైక్రో ఫోన్‌ను, 7, 8అడుగుల లోతులోనూ నమూనాలను సేకరించగల సామర్థ్యాన్ని ఈ రోవర్‌లో పొందుపర్చారు.

జెజెరొ బిలంలోని పురాతన నదీమార్గంలో రాళ్లు, మట్టి, ఇతర నమూనాలను ఈ రోవర్ సేకరిస్తుంది.

పర్సవరన్స్ రోవర్ సేకరించి, ట్యూబ్స్‌లో సీల్ చేసి, అక్కడే భద్రపరిచిన నమూనాలను భూమికి తీసుకువచ్చేందుకు మరో రోవర్‌ను ప్రయోగిస్తారు.


మన  భారతీయ సంతతి కి చెందిన వారు ఇందులో

మార్స్ 2020 మిషన్‌లో భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి మోహన్ కీలక బాధ్యతలు నిర్వరిస్తున్నారు.

మార్స్ 2020గెడైన్స్, నేవిగేషన్, అండ్ కంట్రోల్స్(జీఎన్ అండ్ సీ)కి స్వాతి ఆపరేషన్స్ లీడ్‌గా నాయకత్వం వహిస్తున్నారు.

✌ మొత్తం ప్రయోగంలో లీడ్ సిస్టమ్ ఇంజినీర్‌గానూ కీలకంగా ఉన్నారు

భారత్ నుంచి ఏడాది వయసులో స్వాతి మోహన్ తన తల్లిదండ్రులతో పాటు అమెరికా వెళ్లారు.

 

 

Post a Comment

0 Comments

Close Menu