👉 అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం ??

 

👉 ఏమిటి : అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం (ఇంటర్నేషనల్‌ మిల్లెట్స్‌ ఇయర్‌) 2023

👉 ఎప్పుడు : మార్చి 4

👉 ఎవరు :   ఐక్యరాజ్యసమితి

👉ఎందుకు : చిరు ధాన్యాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ప్రపంచ దేశాల్లో అవగాహన కల్పించేందుకు.

👉 2023 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్ (అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం) గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

👉 చిరు ధాన్యాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ప్రపంచ దేశాల్లో అవగాహన కల్పించడం, మారుతున్న వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా చిరు ధాన్యాల సాగుని ప్రోత్సహించడం వంటివి 2023 ఏడాది చేపడతారు.

👉 భారతదేశ తీర్మానం మేరకు 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐరాస ప్రకటించింది.

👉 బంగ్లాదేశ్, కెన్యా, నేపాల్, నైజీరియా, రష్యా, సెనెగల్‌ దేశాలతో కలిపి భారత్‌ ఈ తీర్మానాన్ని తీసుకురాగా మరో 73కి పైగా దేశాలు మద్దతు తెలిపాయి.

ఐక్యరాజ్యసమితి...

  • ప్రధాన కార్యాలయం : న్యూయార్క్‌(అమెరికా)
  • అధికార భాషలు : అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్‌
  • ప్రస్తుత సెక్రటరీ జనరల్‌ : అంటోనియో గుటెర్రెస్‌
  • ఏర్పాటు : 1945, అక్టోబర్‌ 24
  • ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య: 193

ఐరాసాలో  చివరిగా చేరిన దేశాలు ….

  • 189 – తువాలు (సెప్టెంబరు, 2000)
  • 190 – స్విట్జర్లాండ్‌ (సెప్టెంబరు, 2002)
  • 191 – తూర్పు తిమోర్‌ (2006)
  • 192 – మాంటెనెగో (2006)
  • 193 – దక్షిణ సూడాన్‌ (జూలై, 2011)

ఐక్యరాజ్యసమితి  సమితి ఆశయాలు

  • ఐ.రా.స.లో వివిధ దేశాలు చేరిన దశకాలను సూచించే చిత్రపటం.
  • యుద్ధాలు జరగకుండా చూడటం,
  • అంతర్జాతీయ తగాదాలను శాంతియుతంగా పరిష్కరించడం,
  • దేశాల మధ్య స్నేహసంబంధాలను పెంపొందించడం,
  • అంతర్జాతీయ బాధ్యతలను అన్ని దేశాలు గౌరవించేటట్లు చేయడం,
  • సాంఘిక అభివృద్ధి సాధించి, మానవ జీవితాలను సుఖమయం చేయడం.

Post a Comment

0 Comments

Close Menu