👉 జైపూర్‌ మెట్రో రైల్‌ కార్పొరేషన్ అదనపు ఆదాయం కోసం....‌

 

👉ఏమిటి : పుట్టిన రోజు వంటి ఫంక్షన్లు మెట్రో రైల్‌ కోచుల్లో

👉 ఎప్పుడు : ఇటివల

👉 ఎవరు : జైపూర్‌ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌

👉 ఎక్కడ : రాజస్థాన్‌లో

👉 ఎందుకు : అదనపు ఆదాయం కోసం ఈ నిర్ణయం


👉 ఇకపై పుట్టిన రోజు వంటి ఫంక్షన్లు మెట్రో రైల్‌ కోచుల్లో జరుపుకోవచ్చు.

👉 ఇలాంటి వేడుకల కోసం వీటిని అద్దెకు తీసుకోవచ్చని రాజస్థాన్‌లోని జైపూర్‌ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ తెలిపింది.

👉ఒక కోచ్‌కు నాలుగు గంటలకు రూ.5,000 ప్రతి అదనపు గంటకు రూ.1,000 చార్జ్‌ అవుతుందని తెలిపింది. నాలుగు కోచ్‌లకు నాలుగు గంటలకు రూ.20,000, ప్రతి అదనపు గంటకు రూ.5,000 చార్జ్‌ వసూలు చేస్తామని చెప్పింది.

👉అలాగే ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలతో కలిసి స్వల్ప కాల ప్రకటనలు, బ్యానర్లు, ప్రకటనల స్టాండ్లను సంబంధింత చార్జీలతో మెట్రో స్టేషన్లలో ఏర్పాటు చేస్తామని జైపూర్‌ మెట్రో రైల్‌ తెలిపింది.

👉అదనపు ఆదాయం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది.


Post a Comment

0 Comments

Close Menu