👉ఏమిటి : అన్ని ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలపై జాతీయ జెండా ఎగుర వేయాలి
👉ఎప్పుడు : ఇటివల
👉ఎవరు : డిప్యూటీ కమిషనర్
👉ఎక్కడ : జమ్ముకశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా
👉ఎందుకు: మువ్వన్నెల జెండాను ఆవిష్కరించేందుకు సంబంధించిన చట్టాలపై ప్రజలకు, ప్రభుత్వ సంస్థలకు అవగాహన కల్పించేందుకు.
👉జమ్ముకశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది.
👉ఆ ప్రాంతంలోని అన్ని ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలపై జాతీయ జెండా ఎగుర వేయాలని డిప్యూటీ కమిషనర్(డీసీ) ఆదేశించారు. 15 రోజుల గడువు విధిస్తూ.. ఉత్తర్వులు జారీచేశారు.
👉మువ్వన్నెల జెండాను ఆవిష్కరించేందుకు సంబంధించిన చట్టాలపై ప్రజలకు, ప్రభుత్వ సంస్థలకు అవగాహన కల్పించేందుకు గాను 2002లో కేంద్ర ప్రభుత్వం 'ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా'ను తీసుకొచ్చినట్లు డీసీ పేర్కొన్నారు.
ఈ నిర్ణయం అన్ని జిల్లాలకు ప్రేరణగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పతాక ఆవిష్కరణకు సంబంధించి రోజువారీ నివేదిక సమర్పించాలని తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు డీసీ.
👉ప్రొఫార్మా ప్రకారం.. జిల్లా పేరు, అధికారిక భవనాల సంఖ్య, ఆ తేదీ నాటికి ఎగురవేసిన జెండాలు, ఎంత శాతం పని పూర్తయింది? లాంటి విషయాలను నిర్దేశించిన ఫార్మాట్లో నివేదించాలని వారు వివరించారు.
👉మన భారత జాతీయ జెండా పేరు ఏమిటి?
👉జాతీయ జెండా యొక్క నియమాలు ఏమిటి?
👉భారతదేశ జెండాను ఎవరు చేశారు?
👉 జెండా యొక్క 3 రంగులు అంటే ఏమిటి?
0 Comments