👉ఆంధ్రప్రదేశ్ లో మాత్రం షెడ్యూల్ ప్రకారం పరీక్షలు

👉పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు పంపాలని పలు రాష్ట్రాలు నిర్ణయం 

👉చాల రాష్ట్రాలు పాఠశాలలను మూసి వేశాయి

👉పరీక్షలు లేకుండానే 5, 8, 10 తరగతుల విద్యార్థులను పై తరగతులకు

👉ఒడిశాహరియాణ రాష్ట్రాలు కూడా పంజాబ్‌ బాటలోనే

👉ఉత్తర్‌ప్రదేశ్‌లోని అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు



👉కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని రాష్ట్రాలు పాఠశాలలను మూసి వేశాయి. మరోవైపు విద్యా సంవత్సరం ముగింపునకు రావడంతో ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం కష్టంగా మారింది. దీంతో పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు పంపాలని పలు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి.

👉కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలు లేకుండానే 5, 8, 10 తరగతుల విద్యార్థులను పై తరగతులకు పంపనున్నట్లు తెలిపింది.

👉10వ తరగతి పరీక్షలు రద్దు, 12వ తరగతి పరీక్షలు వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఇప్పటికే తీసుకొంది.

👉ఏప్రిల్‌ 30 వరకూ అన్ని విద్యా సంస్థలను మూసి వేస్తున్నట్లు సీఎం అమరీందర్‌ ప్రకటించారు. 5వ తరగతి విద్యార్థులు ఐదింటిలో ఇప్పటికే 4 సబ్జెక్ట్‌ల పరీక్షలు రాసేశారు.

👉ఇక 8, 10 తరగతుల విద్యార్థుల ఉత్తీర్ణతను ప్రీ-బోర్డ్‌ ఎగ్జామ్స్‌, ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ ఆధారంగా నిర్ణయిస్తారు.అదే బాటలో ఒడిశా, హరియాణ రాష్ట్రాలు కూడా పంజాబ్‌ బాటలోనే పయనిస్తున్నాయి.

👉విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 10, 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది.

👉10వ తరగతి పరీక్షల రద్దుతో పాటు, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు హరియాణా ప్రభుత్వం తెలిపింది.

👉ఉత్తర్‌ ప్రదేశ్‌లో 15 వరకు మూసివేతకొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో మే 15 వరకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాక 10, 12 తరగతుల బోర్డ్‌ ఎగ్జామ్స్‌ను కూడా మే 20 వరకు వాయిదా వేశారు.

👉ఆంధ్రప్రదేశ్ లో మాత్రం షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని పరీక్షల వాయిదా ఆలోచన లేదని ఏపీ విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్ తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu