కాకతీయులు (క్రీ.శ.1030-1323) kakatiyulu 1

 కాకతీయులు (క్రీ.శ.1030-1323)



  • మూలపురుషుడు:కాకర్త్య గుండ్యన
  • స్థాపకుడు:            మొదటి బేతరాజు
  • స్వతంత్ర రాజ్య స్థాపకుడు:రుద్రదేవుడు
  • రాజధాని: హన్మకొండ/ఓరుగల్లు
  • చిహ్నం :వరాహం 
  •  కులదైవం :కాకతి(అనగా గుమ్మడి) దేవతారాధకులు.
  • రాజభాష:సంస్కృతం
  • వర్ణం :శూద్రులు 
  • మతం:మొదట జైనమతం, తర్వాత శైవం
  • బిరుదాంకితులు:"ఆంధ్రదేశాధీశ్వర" 
  • వంశం  :దుర్జయ వంశం (బయ్యారం శాసనం ప్రకారం)

చారిత్రక ఆధారం:మాగల్లు శాసనం (దానార్ణవుడి),బయ్యారం శాసనం (మైలాంబ)

నగర నిర్మాతలు:హన్మకొండ (ప్రోలరాజు-2)  ,ఓరుగల్లు (కాకతీయ రుద్రుడు)

శాసనాలు:

  • 1) బయ్యారం-మైలాంబ
  • 2) హన్మకొండ-కాకతిరుద్ర
  •  3) మోటుపల్లి-గణపతిదేవుడు

శిల్పకళ:

  • 1) వేయిస్థంబాల గుడి - రుద్రదేవుడు. 
  • 2) రామప్పగుడి - రేచర్ల రుద్రుడు

విదేశీ యాత్రికులు  :మార్కోపోలో (1292-రుద్రమదేవికాలంలో)

గొప్పవాడు:గణపతిదేవుడు

చివరివాడు :రెండవ ప్రతాపరుద్రుడు:

నాట్యకత్తె :మాచల్దేవి (ప్రతాపరుద్ర-2 కాలంలో) ఈమె ఓరుగల్లులో "చిత్రశాలను" నిర్మించింది.

మొదటి బేతరాజు (క్రీ.శ. 995-1052)

  • ఇతను కాకర్త్య గుండన కుమారుడు.
  • ఇతనికి గరుడ బేతరాజు అని కూడా పేరుంది.

ఇతని బిరుదులు - 1. చోళచమూవారి ప్రమధన (చోళుల పై విజయం), 2. కాకతి పురాధినాథ ఆ హనుమకొండను రాజధానిగా చేసుకొని స్వతంత్రం ప్రకటించుకొన్నాడు.

మొదటి ప్రోలరాజు (క్రీ.శ.1052-1076)

  • గరుడ బేతరాజు కుమారుడు మొదటి ప్రోలరాజు 

ఇతని చరిత్రకు ఆధారమైన శాసనాలు -

  • 1. శనిగరం శాసనం.
  • 2. కాజీపేట శాసనం (దుర్గం రాజు) 

ఇతని పాలన కాలం క్రీ.శ. 1053 ప్రాంతంలో వేయించిందే శనిగరం శాసనం)

 రెండో బెతరాజు (క్రీ.శ. 1076-1108):

బిరుదులు: 

  • 1. విక్రమచక్ర        
  • 2. త్రిభువనమల్ల,
  • 3. చలమర్తిగండ   
  • 4. మహామండలేశ్వర.

⭐ఇతనికి కుడిభుజంగా, మంత్రిగా, దండనాథుడిగా వ్యవహరించిన వ్యక్తి వైజదండాధిపుడు.

⭐ఇతను కాకతీయ వంశస్థులలో తొలి శైవుడు.

⭐రామేశ్వర పండితుడి వల్ల శైవమత దీక్ష పుచ్చుకున్నాడు కాలముఖ శైవశాఖను అభిమానించాడు.

రెండో ప్రోలరాజు (క్రీ.శ. 1116-1157) 

  • తొలి కాకతీయులలో సుప్రసిద్ధుడు |

బిరుదులు - 1. మహామండలేశ్వర 

                    2. దారిద్ర వద్రామణ - పేదరికాన్ని రూపుమాపినందుకు

⭐ఇతని మంత్రి బేతన భార్య మైలమ హన్మకొండలో కడలాలయ జైన బసదిని నిర్మించింది.

⭐రెండో ప్రోలరాజు కాలంలో నిర్మించిన హనుమకొండలోని ఆలయాలు :

  •  1. పద్మాక్షి ఆలయం
  • 2. సిద్ధేశ్వర ఆలయం
  • 3. స్వయంభు ఆలయం

⭐శివాలయంగా మారిన జైన ఆలయం పద్మాక్షి ఆలయం అని తెలుస్తుంది.

⭐ఇతని విజయాలను తెలియజేసే శాసనం - రుద్రదేవుని హనుమకొండ శాసనం

⭐ బోదరాజు యొక్క ద్రాక్షారామం శాసనం ప్రకారం ప్రోలరాజు బోదరాజుచే హతమార్చబడ్డాడు.

⭐ రెండో ప్రోలరాజు పానగల్లు వరకు దండెత్తి శ్రీశైలంలో విజయ స్తంభం ప్రతిష్టించాడు.


satavahana 1 (శాతవాహనుల రాజకీయ పరిణామ క్రమం)

Chola dynasty (చోళులు )

సంగము రాజ్యాలు/ప్రాచీన తమిళ రాజ్యాలు

satavahana (శాతవాహనుల చరిత్ర ఆధారాలు)

Wonder of Creation  (జునాఖాన్)  పిచ్చిసుల్తాన్

Post a Comment

0 Comments

Close Menu