రుద్రమదేవి (క్రీ.శ.1262-1289) Rudrama Devi

 రుద్రమదేవి Rudrama Devi 

 (క్రీ.శ.1262-1289) 


⭐గణపతి దేవుడి కుమార్తె

ఈమె ఆంధ్రదేశాన్ని పాలించిన మొదటి మహిళ.

⭐బిరుదులు 

  • 1. రుద్ర మహారాజు 
  •  2. పట్లో దృతి (కాయస్థ  జన్నిగదేవుని దుర్గి శాసనం)
  •  3. రాయగజకేసరి ( యాదవులపై విజయానికి గుర్తుగా) 

⭐ ఈమె గురువు విశ్వేశ్వర శంభు. ఈయనకు 'మందడ' అనే గ్రామం దానం చేయడమైనది.

రుద్రమదేవి రాజ్య ప్రారంభంలో అంతర్గత తిరుగుబాట్లను అణచి రాజ్య స్థిరీకరణలో ప్రముఖపాత్ర వహించిన రేచెర్ల ప్రసాదిత్యుడు కాకతీయరాజ్య స్థాపనాచార్య, రాయపితామహాంక అనే బిరుదును ధరించినట్లు తెలుస్తుంది.

బీదర్ శాసనం ప్రకారం యాదవ రాజైన మహదేవుడు రుద్రమదేవి చేతిలో ఓడిపోయినట్లు తెలుస్తుంది.యాదవులపై విజయానికి చిహ్నంగా ఓరుగల్లు స్వయంభూ దేవాలయంలో రంగ మండపాన్ని నిర్మించినట్లుచరిత్ర చెబుతుంది.

నిరవద్య పురాధీశ్వరుడైన చాళుక్య వీరభద్రుడు రుద్రమదేవి భర్త

రుద్రమకు ఇద్దరు కుమార్తెలు

1. ముమ్మడమ్మ ఈమె భర్త మహాదేవుడు

2. రుయ్యమ్మ - ఈమె భర్త అన్నలదేవుడు (ఇందులూరు).ఇతను రుద్రమదేవి సేనాని. మహాప్రధాని.

రుద్రమదేవి పాలన కాలంలోనే వెనీస్ యాత్రికుడైన మార్కొపోలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించాడు. 

రుద్రమదేవి కాలం నాటిదే మల్కాపురం శాసనం. ఈ శాసనం పాశుపత శైవానికి సంబంధించి విలువైన సమాచారాన్ని తెలుపుతుంది.

రుద్రమదేవి కాలంలో ఈమె రాజకీయాధిపత్యాన్ని ధిక్కరించి స్వాతంత్ర్యాన్నిప్రకటించుకున్న సామంతుడు కాయస్థ అంబదేవుడు

కాకతీయులపై అంబదేవుడు విజయం సాధించినట్లు చందుపట్ల (నల్గొండ) శాసనం తెలుపుతుంది.

కాయస్థ అంబదేవుడితో జరిగిన పోరులో రుద్రమతోపాటు ప్రధానసేనాని మల్లిఖార్జునుడు మరణించినట్లు తెలుస్తుంది.

కాకతీయులు (క్రీ.శ.1030-1323) kakatiyulu 1


రుద్రదేవుడు (క్రీ.శ. 1158-1195) Rudradeva

Post a Comment

0 Comments

Close Menu