రెండో ప్రతాపరుద్రుడు (క్రీ.శ. 1289-1323)

 రెండో ప్రతాపరుద్రుడు (క్రీ.శ. 1289-1323)



⭐ ఇతను రుద్రమదేవి మనుమడు, ముమ్మడమ్మ, మహదేవుల కుమారుడు

⭐ ఇతను కవి, పండిత పోషకుడు.

⭐ఇతని ఆస్థానకవి - విద్యానాథుడు. ఇతను ప్రతాపరుద్ర యశోభూషణం అనే అలంకార గ్రంథాన్ని రచించాడు.

⭐ఇతని సేనాని అయిన గన్నారెడ్డికి మారన మార్కండేయపురాణాన్ని అంకితమిచ్చాడు.

సింహాసనాన్ని అధిష్టించగానే తిరుగుబాటు జరుపుతున్న కాయస్థ అంబదేవుని ఓడించాడు.

అంబదేవుని ఓడించడంలో ప్రతాపరుద్రుని తరఫున ఇందులూరి అన్నయమంత్రి ప్రముఖపాత్ర వహించాడు.

ఆడిదంమలు సేనాని నాయకత్వాన నెల్లూరుపై దాడి జరిగింది. 

నెల్లూరు పాలకుడైన మనుమగొండ గోపాలుని సంహరించి ఆడిదం మల్లు 'మనుమగొండ గోపాల శిరఃఖండన' అనే బిరుదు వహించాడు.

కాకతి రాజ్య విస్తీర్ణం రెండో ప్రతాపరుద్రుని కాలంలో అత్యున్నత స్థితికి చేరింది. తన పాలనా దక్షతతో దేశ రక్షణకు సైన్యాన్ని సిద్ధం చేయడానికి గణపతి దేవుడు ప్రారంభించిన 'నాయక వ్యవస్థ'ను పునర్నిర్మించాడు.

కంచిపురంపై కాకతీయుల ఆధిపత్యాన్ని స్థాపించాడు. 

ఇతని కాలంలో రాజ్యం 77 నాయంకరలు( సైనికవిభాగాలు) గా విభజితమై ఉండేది. 

నాయంకరలు అధికంగా పద్మనాయకులు అనే కులానికి చెందినవారు. నాయంకరులకు వారి ఆధీనంలోఉండే ప్రాంతాలలో పన్ను వసూలు చేసే అధికారంతో పాటు శాంతి భద్రతలను పర్యవేక్షించే బాధ్యత ఉండేది .

ఇతని కాలంలో మాచలదేవి కళాకారిణి ఉండేది. ఈమె పేరిణి నృత్యకారిణి.

సమ్మక్క సారక్క ఇతనికి వ్యతిరేకంగా పోరాటం చేశారు.

కాకతీయులు (క్రీ.శ.1030-1323) kakatiyulu 1

రుద్రదేవుడు (క్రీ.శ. 1158-1195) Rudradeva

గణపతి దేవుడు (క్రీ.శ. 1199-1262) Ganapati Devudu

 రుద్రమదేవి (క్రీ.శ.1262-1289) Rudrama Devi 

రెండో ప్రతాపరుద్రుడు (క్రీ.శ. 1289-1323)

Post a Comment

0 Comments

Close Menu