మోధేరా సూర్య దేవాలయం

 మోధేరా సూర్య దేవాలయం



వార్తలలో ఎందుకు ?

⭐సూర్య దేవాలయానికి ప్రసిద్ధి చెందిన మోధేరాను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు.  .

⭐1026-27 CE తర్వాత చాళుక్య వంశానికి చెందిన భీముడు I పాలనలో ఈ ఆలయం నిర్మించబడింది .

⭐మోధేరాలోని సూర్య దేవాలయాల అవశేషాలు , అగ్ని, గాలి, భూమి, నీరు మరియు ఆకాశం అనే సహజ మూలకాల యొక్క గౌరవం వేద దేవుళ్ల యొక్క అసంఖ్యాకమైన ఆవిర్భావాలతో వాటి గరిష్ట భాగస్వామ్య స్థలాన్ని కలిగి ఉన్న కాలాల అవశేషాలు.

⭐ఉత్తర గుజరాత్‌లోని ప్రధాన పర్యాటక ప్రదేశాలలో ఇది ఒకటి.

మొధెరా గురించి 

⭐గుజరాత్ లో మహాసానా జిల్లాలో కల మొధెరా ఒక చిన్న పల్లెటూరు. ఈ పల్లెకు కొద్ది దూరంలో పుష్పవతి నది ప్రవహిస్తుంది. 

⭐ఇది ఉత్తర గుజరాత్లో గల సరస్వతీ నదిలో కలిసి పడమరగా నున్న రణ్ ఆఫ్ కచ్ లోనికి పోయి కలుస్తుంది. ఇది మొహసానాకు 18 మైళ్ళ పడమరగా ఉంది. 

⭐పాటన్ శివారుకు చెందినది. పాటన్ అసలు పేరు అంహిలవడి పాటన్. ఇది సోలంకి రాజుల ముఖ్య పట్టణం. 

⭐వారి కాలంలో బంగారం, ముత్యాలు, రత్నాలు మొదలగునవి రోడ్డుమీద గుట్టలుగా పోసి అమ్మెడివారట. 

⭐ఈ పట్టణానికి 8 మైళ్ళ దక్షిణంగా ఒక మహారణ్యం ఉండేదట. దాని పేరు ధర్మారణ్యం.

⭐ సోలంకిరాజుల కాలములో పాటన్ లో రాజాదరణలో వున్న కొద్దిమంది బ్రాహ్మణులకు, ధర్మారణ్యంలో కొంతభాగం బాగు చేయించి వసతులు కల్పించి దాన మిచ్చారట. 

⭐పాటన్ నుంచి వచ్చిన బ్రాహ్మణులు మొధ్ లేదా యొఢ్ బ్రాహ్మణులట. వారికి ఇక్కడ వసతులు కల్పించబడినవి కావున దీనికి యొఢెరా లేదా మొధెరా అనే పేరు వచ్చింది.

Post a Comment

0 Comments

Close Menu