ప్రాచీన తమిళ రాజ్యాలు

 సంగము రాజ్యాలు/ప్రాచీన తమిళ రాజ్యాలు



⭐తమిళుల చరిత్ర సంగం యుగంతో ప్రారంభమవుతుంది.

⭐సంగం అంటే పరిషత్తు, కూడలి లేదా సమావేశం అని అర్థం.

⭐దీనిని ప్రాచీన కాలంలో పాండ్య ప్రభువులు మధురైలో ఏర్పాటు చేయడం జరిగింది.

⭐ఇందులోని వందలకొద్ది కవులు సృష్టించిన సారస్వతమే సంగమ వాజ్ఞయంగా ప్రసిద్ధికెక్కింది.

⭐ఈ వాజ్ఞయంలో  తమిళదేశ సంస్కృతి స్పష్టంగా ప్రతిబింభిస్తుంది.

⭐గొప్పగా ప్రసిద్ధి చెందిన సంగమ యుగం నాటి రాజ్యాలు :

1.చోళవంశం

2.చేర వంశం

3.పాండ్య వంశం  

⭐దక్షిణ భారతదేశంలో వెలసిన చోళ, పాండ్య మరియు చేర అనే ఈ తమిళ రాజ్యాలు తమిళభాషను మరియు సాహిత్యంను అభివృద్ధి చేసినవి.

ప్రాచీన తమిళ రాజ్యాలైన చేర, చోళ, పాండ్య రాజ్యాలను ఎక్కడ ప్రస్తావించారు  ?

⭐అశోకుని 13వ ప్రధాన శిలా శాసనం

⭐మెగస్తనీస్ రచనలు

⭐ఖారవేలుని హథిగుంప శాసనం

⭐చోళ, చేర, పాండ్య రాజ్యాలు మౌర్య సామ్రాజ్యంలో లేవని అవి ప్రత్యేకమని  పేర్కొన్న తమిళ గ్రంథం _ మామూళ్లనార్ 

⭐ఈ మూడు రాజ్యాలు కలిసిన ప్రాంతాన్ని ప్రాచీన వాజ్ఞయంలో తమిళం లేదా ద్రావిడ దేశం అని వ్యవ జరిగింది.

⭐ఈ మూడు రాజ్యాల రాజకీయ ఆధిపత్యం కోసం జరిగిన పోరాటంలో మొదట చోళులు విజయం సాధించి రాజకీయ అధిపత్యాన్ని చేపట్టినారు.

సంగం యుగకాలం విషయంలో చరిత్రకారులకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి :

1. రామచంద్ర దీక్షితార్- క్రీ.పూ. 6వ శతాబ్దం నుంచి 5వ శతాబ్ద మధ్య కాలం అని

2. ఎన్. సుబ్రమణియన్ - క్రీ.పూ. 4వ శతాబ్దం నుంచి 3వ శతాబ్ద మధ్య కాలం అని

3. ఆచార్య నీలకంఠ శాస్త్రి - క్రీ.శ. మొదటి 3 శతాబ్దాలకు చెందినదని పేర్కొన్నారు.

 

⭐చోళ రాజ్యం  విస్తరించిన ప్రాంతం : ఉత్తర తమిళనాడు

⭐చేర రాజ్యం   విస్తరించిన ప్రాంతం: కేరళ ప్రాంతం

⭐పాండ్య రాజ్యం విస్తరించిన ప్రాంతం: దక్షిణ తమిళనాడు

 

⭐చోళ సామ్రాజ్య స్థాపకుడు :  ఎలారా

⭐చేర  సామ్రాజ్య స్థాపకుడు : యుధివంజారాల్

⭐పాండ్య సామ్రాజ్య స్థాపకుడు :  ముదికుడిమి

 

⭐చోళ సామ్రాజ్యము లో గొప్పవాడు :  కరికాళ చోళ

⭐చేర సామ్రాజ్యము లో గొప్పవాడు : సెంగుత్తవాన్

⭐పాండ్య సామ్రాజ్యము లో గొప్పవాడు : నెడుంజలియన్

 

⭐చోళ సామ్రాజ్య రాజధాని : ఉరయూర్

⭐చేర సామ్రాజ్య రాజధాని : వంజి /కరూర్

⭐పాండ్య సామ్రాజ్య రాజధాని : మధురై

 

⭐చోళ సామ్రాజ్య రాజ్య లాంఛనము  : పులి

⭐చేర సామ్రాజ్య రాజ్య లాంఛనము  : విల్లు & బాణము

⭐పాండ్య సామ్రాజ్య రాజ్య లాంఛనము : చేప

Post a Comment

0 Comments

Close Menu