కాకతీయుల సాహిత్యం ,వాస్తు శిల్పకళ , ఆలయాలు kakatiya administration 3

 కాకతీయుల సాహిత్యం 



🔯 కాకతీయుల రాజభాష సంస్కృతం

🔯 రుద్రదేవుడు స్వయంగా కవి. “నీతిసారం" అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు.

🔯ప్రతాపరుద్రుని ఆస్థాన కవి అయిన విద్యానాథుడు "ప్రతాపరుద్ర యశోభూషణం" అనే గ్రంధాన్ని రచించాడు. విద్యానాథుని అసలు పేరు అగస్త్యుడు.

🔯 ఇతని సంస్కృత రచనలు - బాలభారతం,నలకీర్తి కౌముదం,కృష్ణ చరితం .

🔯 విద్దనాచార్యుడు - ప్రమేయ చర్చామృతం

🔯 గణపతి దేవుని యొక్క గజదళాధిపతి అయిన జయప్పసేనాని సంస్కృత రచనలు

  • గీత రత్నావళి,
  • నృత్యరత్నావళి

🔯 రావిపాటి త్రిపురాంతక కవి "ప్రేమాభిరామమ్" అనే వీధి నాటకం వ్రాశాడు. 

🔯 వీరి కాలం నాటి సంస్కృత శాసనాలు 

  1. హనుమకొండ శాసనం - అచితేంద్రుడు.
  2. గణపవరం శాసనం - నంది 
  3. భూదాపుర శాసనం-మయూరభుట్టోపాద్యుడు
  4. కుందవరం శాసనం - బాలభారతి

తెలుగు:

వీరికాలంలో గల తెలుగు శాసనాలు

  • చేబ్రోలు శాసనం - భీమయపండ
  • గూడురు శాసనం - బేతరాజు - 2 
  • కొణిదెన్ శాసనం - ఓపిలిసిద్ది
  • తాళ్ళప్రొద్దుటూరి శాసనం - జగతాపి గంగదేవుడు.

🔯నెల్లూరు తెలుగు చోడిరాజైన 2వ మనుమసిద్ది ఆస్థాన కవి తిక్కన రచించిన గ్రంధం "నిర్వచనోత్తర రామాయణం "

🔯 ఇతను రచించిన ఉత్తమ సాహిత్య గ్రంథం 'ఆంధ్ర మహాభారతం'

🔯 తిక్కన బిరుదులు - కవిబ్రహ్మ, ఉభయకవిమిత్రుడు

🔯 తిక్కన సమకాలికుడు అయిన కేతన రచించిన గ్రంథాలు :

  • దశకుమార చరిత్ర - తిక్కనకు అంకితం
  • ఆంధ్రభాషా భూషణం - తెలుగులో రచించబడిన మొట్టమొదటి వ్యాకరణం
  • విజ్ఞానేశ్వరీయం - తెలుగులో మొట్టమొదటి ధర్మశాస్త్ర గ్రంథం 

🔯 కేతనకు తిక్కన ఇచ్చిన బిరుదు - అభినవ దండి

🔯తిక్కన యొక్క మరో సమకాలికుడు మారన. ఇతను రచించిన గ్రంథం 'మార్కండేయ పురాణం

ఈ కాలం నాటి ఇతర కవులు 

  1. మంచెన - కేయూరబాహుచరిత్ర
  2. కృష్ణమాచార్యుడు - సింహగిరి నరహరి వచనములు 
  3. బద్దెన- నీతిశాస్త్ర ముక్తావళి, సుమతి శతకం
  4.  యధావాక్కుల అన్నమయ్య - సర్వేశ్వర శతకం (తెలుగులో మొట్టమొదటి శతకం) 
  5.  గోన బుద్దారెడ్డి - రంగనాథ రామాయణం ( తెలుగు ద్విపద కావ్యాలలో తలమానికం)
  6. మల్లిఖార్జున పండితుడు -శివతత్య సారం 
  7. మండి కి సింగన - సకలనీతి సమ్మతం 
  8. నన్నెచోడుడు - కుమార సంభవం
  9. పాల్కురికి సోమనాథుడు - బసవ పురాణం 
  10. రావిపాటి త్రిపురాంతకుడు - అంబికాతారావళి

వాస్తు శిల్పకళ:

🔯 కాకతీయ రాజులు వారి సామంతులు అనేక జైన, శైవ, వైష్ణవ ఆలయాలు నిర్మించారు.

🔯కాకతీయులు దేవాలయ నిర్మాణంలో పశ్చిమ చాళక్యుల వాస్తువిధానాన్ని అనుసరించి త్రికూటాలయాలను నిర్మించారు 

🔯 మూడు శివాలయాలు కానీ లేదా శివ, విష్ణు, సూర్యదేవాలయాలు మూడు వైపుల నిర్మించి

ఒక విశాల మండపాన్ని నిర్మించడం త్రికూట విధానం.

🔯 కాకతీయుల కాలంలో త్రికూట ఆలయాలు : 

  • 1. పాలంపేట ఆలయం.
  • 2. పిల్లలమర్రి ఆలయం
  • 3. వేయిస్తంభాల గుడి 

కాకతీయుల ఆలయాలు

🔯స్వయంభు దేవాలయం - దీనిని 2వ ప్రోలరాజు ప్రారంభించగా, గణపతిదేవుడు పూర్తి చేశాడు. 

🔯 ఈ ఆలయంనకు నాలుగువైపుల నాలుగు శిలా తోరణాలు ఉన్నాయి.

పద్మాక్షి ఆలయం :

  • దీనిని 2వ ప్రోలరాజు నిర్మించాడు.
  • ఇది మొదట్లో జైన ఆలయం తరువాత శైవ ఆలయంగా మార్చబడింది.
  • ఇది  ఇండో ఇస్లామిక్ శైలిలో నిర్మించబడింది.

వేయిస్తంభాల గుడి:

🔯దీనిని మరొక పేరు రుద్రేశ్వరాలయం. 

🔯 దీనిని క్రీ.శ. 1168లో రుద్రదేవుడు హనుమకొండలో నిర్మించాడు.

రామప్ప దేవాలయం :

🔯 దీనిని రేచర్ల రుద్రుడు పాలంపేట వద్ద ఏకశిల పద్దతిలో నిర్మించాడు.

🔯 ఈ ఆలయ గోడలపై పేరిణీ నృత్య భంగిమలు చెక్కబడి ఉన్నాయి. (కాకతీయుల కాలంలో ప్రసిద్ద నృత్యం - పేరిణీ నృత్యం)

ఇతర దేవాలయాలు:

🔯 ప్రసన్న కేశవాలయం -వెల్లంకి గంగాధరుడు (రుద్రదేవుని మంత్రి)

🔯 భీమేశ్వరాలయం - వెల్లంకి గంగాధరుడు 

🔯 శ్రీశైల దేవాలయం - మైలాంబ (గణపతిదేవుని సోదరి)

🔯 ఛాయాసోమేశ్వరాలయం -కందుకూరు చోడులు

🔯 పచ్చల సోమేశ్వరాలయం - కందుకూరు చోడులు

🔯 ఓరుగల్లు కోట - రెండవ ప్రోలరాజు ( కోట నిర్మాణం ప్రారంభించినది) రుద్రదేవుడు ( ఎక్కువభాగం కట్టించినది)

కాకతీయులు (క్రీ.శ.1030-1323) kakatiyulu 1

రుద్రదేవుడు (క్రీ.శ. 1158-1195) Rudradeva

గణపతి దేవుడు (క్రీ.శ. 1199-1262) Ganapati Devudu

 రుద్రమదేవి (క్రీ.శ.1262-1289) Rudrama Devi 

రెండో ప్రతాపరుద్రుడు (క్రీ.శ. 1289-1323)

కాకతీయుల పరిపాలనా విధానం : 1 (kakatiya administration)

కాకతీయుల పరిపాలనా విధానం : 2 (kakatiya administration)

 కాకతీయుల సాహిత్యం ,వాస్తు శిల్పకళ ,  ఆలయాలు kakatiya administration 3

Post a Comment

0 Comments

Close Menu