పాండ్యులు (pandyulu)

 పాండ్యులు



⭐వీరి రాజధాని - మధురై 

⭐ముఖ్యపాలకుడు - నెడుంజెలియన్

⭐పాండ్యుల గురించి మొదట ప్రస్తావించినది- మెగస్తనీస్

⭐పుదుక్కోట నుండి కన్యాకుమారి వరకు వీరు పరిపాలించారు.

⭐వీరి రాజచిహ్నం- మీనం

⭐వీరి నౌకాశ్రయము - సెలియా

ముదుకుడిమి పెరువల్లడి :

⭐పాండ్యుల మొదటి రాజు ముదుకుడిమి పెరువల్లడి. ఇతను గొప్ప యుద్ధవీరుడు, సాహిత్యాభిమాని

⭐ఇతను శివుడిని ఆరాధించేవాడు. 

⭐ఇతను అనేక గ్రామాలను బ్రాహ్మణులకు దానం ఇచ్చినట్లు వెల్విక్కుడి శాసనం పేర్కొంటుంది.

నెడుంజెలియన్

⭐సంగం సాహిత్యం అత్యున్నత స్థితిని చేరుకున్న కాలం - నెడుంజెలియన్ పరిపాలనా కాలం  చోళ, చేరరాజుల కూటమిని నెడుంజెలియన్ ఓడించిన యుద్ధం - తలైయాలంగానం (తళయలంగనము ) యుద్ధం 

⭐ఇతను వైదిక మతాభిమాని. ఇతడి పోషణలో కవిపండితులకు మధురై నిలయమైంది. 

⭐ఇతని ఆస్థాన కవి -'మంగుడి మరుదమ్' (ఇతని రచన : మధురైక్కంజి). 

⭐ఈ గ్రంథం మధురై పాండ్య రాజ్య విషయాల గురించి తెలుపుతుంది.

⭐పాండ్య సామ్రాజ్యాన్ని ఒక మహిళ పాలించినట్లు మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో పేర్కొన్నాడు.

⭐పాండ్యుల సామ్రాజ్యం ముత్యాలకు ప్రసిద్ధి. 

⭐పాండ్య రాజులు రోమ్తో తో  వర్తకం సాగించి, రోమన్ చక్రవర్తి ఆగస్టన్ తో  సత్ సంబంధం కలిగి వున్నారు 


Post a Comment

0 Comments

Close Menu