Morbi bridge చరిత్ర

     Morbi bridge చరిత్ర

    మోర్బీ రాజు సర్ వాఘ్‌జీ ఠాకుర్


     
    ⭐గుజరాత్‌లోని మోర్బీ వద్ద మచ్చు నది మీద ఉన్న తీగల వంతెన ఇటీవల  తెగి పడిపోయింది.

    ⭐ఈ ప్రమాదంలో దాదాపు 140 మంది చనిపోయారు.

    ⭐ఇంకా చాలా మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.

    మోర్బీ రాజుల ప్రతీక

    ⭐సుమారు 150 ఏళ్ల నాటి ఈ వంతెన మోర్బీ రాజుల పాలనకు సంబంధించి ఒక  ప్రతీకగా ఉంటూ వస్తోంది అని చెప్పవచ్చు .  

    ⭐మోర్బీ రాజు సర్ వాఘ్‌జీ ఠాకుర్ ఈ వంతెనను నిర్మించారు.

    ⭐నాడు దీని నిర్మాణంలో యూరోపియన్ టెక్నాలజీ వాడారు అని తెలుస్తుంది.

    1879లో ప్రారంభం

    ⭐ఈ వంతెనను 1879 ఫిబ్రవరి 20న నాటి బాంబే గవర్నర్ రిచర్డ్ టెంపుల్ అప్పటిలో  ప్రారంభించారు.

    ⭐వంతెన నిర్మాణంలో వాడిన మెటీరియల్ అంతా ఇంగ్లండ్ నుంచి తెప్పించారు.

    ⭐నాడు వంతెన నిర్మాణానికి రూ.3.5 లక్షలు ఖర్చు అయింది.

    ⭐మోర్బీ పట్టణం ప్రారంభంలో ఈ తీగల వంతెన ఉంటుంది.

    ⭐అప్పటిలో దీన్ని ఒక  సాంకేతికత అద్భుతంగా నాడు పిలుచుకునే వారు.

    ⭐1.25 మీటర్ల వెడల్పు 233 మీటర్ల పొడవు ఉండే ఈ వంతెన దరబార్‌గఢ్ ప్యాలెస్ నుంచి రాజనివాసం నజర్‌బాగ్ వరకు ఉంటుంది.  

    నిర్మాణ శైలి

    ⭐బ్రిటిష్ పాలన కాలంలో యూరోపియన్ నిర్మాణ శైలిని చూసి మోర్బీ రాజు వాఘ్‌జీ ముగ్ధుడయ్యాడు.

    ⭐మోర్బీ పట్టణం చూస్తే ఆ విషయం అర్థమవుతుంది.

    ⭐పట్టణంలో యూరోపియన్ శైలి కట్టడాలు చాలానే కనిపిస్తాయి.

    ⭐మోర్బీని వాఘ్‌జీ ఠాకుర్ 1922 వరకు పాలించారు.

    ⭐పట్టణంలోని ప్రధానమైన 'గ్రీన్ చౌక్'కు వెళ్లాలంటే మూడు ద్వారాలను ఏర్పాటు చేశారు. రాజ్‌పుత్, ఇటలీ నిర్మాణ శైలుల కలయిక ఆ ద్వారాల్లో కనిపిస్తుంది.

    ⭐మోర్బీ రాజుల 'ప్రగతిశీల, శాస్త్రీయ ద్పకృథానికి' ఈ  వంతెన నిదర్శనమని అక్కడి ప్రజలు చెబుతారు.

    ఇప్పుడు నిర్వహణ ఎవరిది ?

    ⭐ప్రస్తుతం తీగల వంతెన నిర్వహణ మోర్బీ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' రిపోర్ట్ చేసింది.

    ⭐ఇటీవల మోర్బీ మున్సిపాలిటీ వంతెన నిర్వహణను ఒరేవా గ్రూప్‌కు అప్పగించింది.

    ⭐15 ఏళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది.

    సస్పెన్షన్ వంతెనలు (Suspension bridges)

    రామ్ సేతు

    బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ (Brahmaputra river)

     

    Post a Comment

    0 Comments

    Close Menu